అమృత్ భారత్ పథకం కింద చీపురుపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారాయి. రాజాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలకు కీలక రవాణా కేంద్రమైన ఈ స్టేషన్ దశాబ్దాల అభివృద్ధి లేమి తర్వాత ఇప్పుడు ఆధునీకరించబడింది. ప్రధాని మోదీ శంకుస్థాపన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. ప్లాట్ఫారాలు పొడిగించడం, షెడ్లు, షైన్ బోర్డులు, పాదచారుల వంతెన, కొత్త భవన నిర్మాణం దాదాపు పూర్తయ్యాయి. దీంతో స్టేషన్ కొత్త అందాలతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారింది.