జామి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి, బాలింతలు ఉండే గది అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఆసుపత్రి సిబ్బంది పనితీరుతో పాటు పరిసరాల పరిశుభ్రతలో మార్పు రావాలని మంత్రి హెచ్చరించారు. పనితీరు మెరుగుపడకపోతే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.