మెంటాడ మండలం జయితి గ్రామంలోని శ్రీ శ్రీ విఘ్నేశ్వర, శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శనివారం ఏకాహం కార్యక్రమం ప్రారంభమైంది. అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు ఈ కార్యక్రమాన్ని ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం వరకు కొనసాగుతుందని భక్తులు తెలిపారు. కార్తీక మాసంలో ఏకాదశి రోజున 24 గంటలు శివనామస్మరణతో గడపడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.