విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఆయన ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.