మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అంబులం పూజ స్థలాన్ని పరిశీలించారు

గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సాయంత్రం జరగనున్న అంబులం పూజ కోసం స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ పూజకు సుమారు 5000 మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
