గజపతినగరం ఎస్ఐ కిరణ్కుమార్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, వేర్వేరు ఘటనల్లో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతిచెందారు. బూడిపేటకు చెందిన మజ్జి పెంటయ్య అనారోగ్యంతో బాధపడుతూ, పురుగుమందు తాగి మృతిచెందగా, అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మరో ఘటనలో, సాలిపేటకు చెందిన కొడిసి ఆదినారాయణ చెట్టెక్కి చింతబొట్టలు రాలుపుతుండగా జారిపడి గాయపడి, విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.