
పార్వతీపురం: స్కూల్లో ఏంటీ సంస్కృతి?
పార్వతీపురం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల ముందు అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. ఈ వీడియోని చూసిన వారంతా ఏంటీ సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. సంబంధిత ఉపాధ్యాయుడు హిజ్రాలను ఆహ్వానించి డ్యాన్సులు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.





































