గత సమ్మె కాలం నాటి ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని సోమవారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల 17 రోజుల సమ్మె సందర్భంగా మున్సిపల్ పరిపాలన అధికారులు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు.