అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2026 సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ప్రారంభించిన ఈ శిబిరంలో సర్వికల్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి పరీక్షలు చేశారు. వైద్యులు వ్యాధుల లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు. ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను, వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఏఎస్పీ తదితరులు పాల్గొన్నారు.