పార్వతీపురం: డిఎంహెచ్ఓగా భాస్కరరావు బాధ్యతలు స్వీకరణ

84చూసినవారు
పార్వతీపురం: డిఎంహెచ్ఓగా భాస్కరరావు బాధ్యతలు స్వీకరణ
పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ ఎస్. భాస్కరరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంత వరకు ఈయన విజయనగరం డిఎంహెచ్ఓగా పని చేసారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది ఆయనకు ఆరోగ్య కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీతంపేట డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కె. విజయపార్వతి ఇంతవరకు డిఎంహెచ్ఓగా విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్