గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అదనపు భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి. అఖిల్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత విద్యా సంవత్సరంలో ఏడుగురు గిరిజన విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ, ఈ మరణాలకు ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలని కోరారు.