ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి గాయాలు

5చూసినవారు
ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి గాయాలు
మన్యం జిల్లా మక్కువ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములక్కాయవలస గ్రామానికి చెందిన గండి జగదీష్ అనే అయ్యప్ప స్వామి భక్తుడు గాయపడ్డాడు. అయ్యప్ప స్వాములతో మాట్లాడుతుండగా, అతివేగంగా వచ్చిన ఓ స్కూల్ బస్సు డ్రైవర్ ట్రాక్టర్‌ను తప్పించబోయి జగదీష్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆయన కుడి కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్