ఒడిశా సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని భామిని మండలంలోకి ప్రవేశించిన పిల్ల ఏనుగు తిరిగి అదే మార్గంలో ఒడిశా వెళ్లిపోయిందని పార్వతీపురం అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. ఒడిశా అటవీశాఖ అందించిన సమాచారం ప్రకారం, ఏనుగు పిల్ల ఒడిశాలోకి ప్రవేశించిందని వారు వెల్లడించారు. పిల్ల ఏనుగు జాడ కోసం గాలిస్తున్న పార్వతీపురం అటవీ శాఖ సిబ్బందికి ఒడిశా ప్రభుత్వం అందించిన ఈ వార్తతో కొంత ఉపశమనం లభించింది.