శృంగవరపుకోట మండలంలోని కొట్టాం గ్రామంలో గోస్తనీ నదిలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వీఆర్వో సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వి. నారాయణమూర్తి తెలిపారు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉంటుందని, నలుపు, ఎరుపు రంగు హాఫ్ హ్యాండ్స్ టీ షర్టు, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని సీఐ కోరారు.