తాటిపూడి జలాశయంలో నేటి నుంచి బోటింగ్ సెషన్ స్టార్ట్

3చూసినవారు
తాటిపూడి జలాశయంలో నేటి నుంచి బోటింగ్ సెషన్ స్టార్ట్
తాటిపూడి రిజర్వాయర్‌ విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ రెండో దశ బోటింగ్ సేవలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిసెంబర్ 27న ప్రారంభించారు. కొత్తగా 10 బోట్లను ప్రవేశపెట్టారు. వాటిలో 19 సీట్ల వాటర్ టాక్సీలు, 6 సీటర్ స్పీడ్ బోట్స్ ఉన్నాయి. నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్