నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని శ్రీ వేణుగోపాల స్వామి, విష్ణుమూర్తి ఆలయంలో శనివారం కార్తీక తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు ఆలయానికి వచ్చి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో చేశారు. ఈ పూజలలో స్థానిక, పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.