విజయనగరంలో శనివారం మదర్ తెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అయ్యన్నపేట జంక్షన్లోని మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో గౌరవ అధ్యక్షులు త్యాడ వేణు గోపాలం చేతుల మీదుగా 15 రకాల నిత్యావసర వస్తువులను పేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రావణి, కీర్తన తదితరులు పాల్గొన్నారు.