నెల్లిమర్ల మండలం సారిపల్లి పారిశ్రామికవాడలో ఈ నెల 9న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయనగరం నీలట్యాంకు ప్రాంతానికి చెందిన బి. శ్రీరాములు (42) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఓ కంపెనీలో రేకుల షెడ్డు ఏర్పాటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి, అతనిపై రేకులు పడటంతో గాయాలయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.