గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతి రాజు 1951 జూన్ 26న జన్మించారు. 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 1983, 85, 89, 94, 99, 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. పలు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగానూ చేశారు.