విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు బుధవారం విజయనగరం పట్టణం వీటి అగ్రహారంలో ముస్లిం పెద్దలతో మాట్లాడుతూ, బక్రీద్ పండగను సామరస్యంగా జరుపుకోవాలని కోరారు. ఎటువంటి విద్వేషాలకు తావులేకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. హిందూ, ముస్లింల మధ్య సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దని తెలిపారు.