విజయనగరం ప్రదీప్ నగర్కు చెందిన ప్రతాప్ సిద్ధార్థ (39) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో విషం తాగిన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి విశ్వేశ్వరరావు ఫిర్యాదు మేరకు 1 టౌన్ HC అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.