విజయనగరంలో ఆదివారం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ నెలవారీ సమావేశం జరిగింది. క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మే నెలలో వైద్య శిబిరాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు, మజ్జిగ చలివేంద్రం కొనసాగింపు వంటి అంశాలపై చర్చించారు. డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.