AP: విజయవాడ రాజకీయాల్లో మరోసారి కేశినేని సోదరుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.