విజయవాడలోని పున్నమి ఘాట్లో ‘విజయవాడ ఉత్సవ్’ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 'ఒకే నగరం- ఒకటే సంబరం' అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. వెంకయ్య నాయుడు, లోకేశ్ పున్నమి ఘాట్లో క్రాకర్స్ షోను తిలకించారు.