AP: కృష్ణా జిల్లా పెదలింగాలలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులకు సమాచారం లేకుండా చెరువుల ఆక్రమణకు తీర్మానం చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పంచాయితీ సెక్రటరీని ముట్టడించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆక్వా జోన్ తమ గ్రామానికి వద్దంటూ నిరసన తెలిపారు.