AP: విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బారి నుంచి లాభాల బాట పడుతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బారి నుండి లాభాలబాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ బాధ్యతారహిత పార్టీల నాయకులు అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని మంత్రి భూపతిరాజు మండిపడ్డారు.