అనంతగిరి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల-1లో సోమవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో పాటు సమీపంలోని విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఘటన సమయంలో
విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీపంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడ బలహీనపడటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తరగతిన విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.