డుంబ్రిగూడ మండల వైఎస్సార్సీపీ నాయకురాలు కమ్మిడి నిర్మల, మంగళవారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీలో పోతంగి పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రధాన సమస్యలను, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు నిర్మల తెలిపారు.