భీమిలి సీమీపంలోని మధురవాడ, చంద్రంపాలెం జాతర గట్టులోని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆదివారం అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం, అమ్మవారిని శ్రీ రజితాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా సహస్ర కుంకుమార్చనలు, ఖడ్గమాలా హోమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.