
బిగ్ అలర్ట్.. విశాఖ జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!
మోంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలలో రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


































