గాజువాక పరిధిలోని లంకెలపాలెం జాతీయ రహదారి, ప్రధాన జంక్షన్లో మంగళవారం రాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.