విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ నేతలు జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై చర్చించి, వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అందరినీ అలరించారు.