పాయకరావుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కోటవురట్లలో శుక్రవారం ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఎంపీడీవో చంద్రశేఖర్ నిర్వహించారు. సీతారామరాజు నగర్ కాలనీలో పారిశుద్ధ్యం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే పర్యావరణ ముప్పు పై అవగాహన కల్పించారు. ఈ రోజుల్లో చాలావరకు పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువగా వాడుతున్నారని, ఎక్కడబడితే అక్కడ పారేస్తున్నారని ఇవి భూగర్భంలో కలిసే అవకాశాలు తక్కువని ప్లాస్టిక్ వాడటం మానేస్తే పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని అన్నారు.