రాజవొమ్మంగి మండలంలో
జనసేన పార్టీ కోసం పనిచేసిన వారికి నూతనంగా పదవుల కోసం అర్జీ చేసుకునే అవకాశం వచ్చిందని
జనసేన అరకు పార్లమెంట్ సమాచార సేకరణ సభ్యులు పళ్ళా అప్పారావు తెలిపారు. ఈనెల 4, 5 తేదీల్లో రంపచోడవరం జిల్లా కేంద్రానికి అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కొణిదల
నాగబాబు వస్తున్నారని, వారికే నేరుగా అర్జీలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నాగబాబును కలిసి రాజవొమ్మంగి మండలంలో
జనసేన పార్టీ పరిస్థితులను వివరించినట్లు అప్పారావు వెల్లడించారు.