
విశాఖ చేరుకున్న రాష్ట్ర గవర్నర్
పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ రాత్రి రాడిసిన్ బ్లూ హోటల్లో బస చేశారు. శుక్రవారం జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొని, తిరిగి సాయంత్రం విజయవాడకు వెళతారు.





































