విశాఖలోని 65వ వార్డులో ఆదివారం స్వస్థ నారి స్వసక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రియదర్శిని కాలనీలోని పబ్లిక్ హెల్త్ సెంటర్లో మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది అవసరమైన వారికి సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బైపల్లి గాంధీ పాల్గొన్నారు.