ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, అక్టోబరు 10న లక్షమంది ఉద్యోగులతో విజయవాడలో మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది. సింహాచలంలో ఆదివారం జరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు.