AP: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. వివేకా, వైఎస్ జగన్కు మధ్య వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లేవని, వైఎస్ సునీత తరపున కూడా అలాంటి ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. వివేకా హత్య ఛార్జిషీట్లోనూ జగన్ ప్రస్తావన లేదని, హత్య జరిగిన రోజు ఉదయం జగన్కు ఫోన్ కాల్పై మరింత దర్యాప్తు అవసరంలేదని తెలిపింది. వివేకా హత్య రోజు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన మెసేజ్లపైనే దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు ఆర్డర్ వేసింది.