
హార్ముజ్లో చిక్కుకున్న 8వేల మంది నావికులు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న దాదాపు 8,000 మంది అంతర్జాతీయ నావికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, నౌకాయానం నిలిచిపోవడంతో వీరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) వీరిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.




