నర్సీపట్నం పాయకరావుపేట ప్రభుత్వ ఐటీఐలో అర్హత కలిగిన యువతకు జర్మనీ దేశంలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ గౌరీ మని మాట్లాడుతూ, ఐటీఐ (ఎలక్ట్రిషియన్ ట్రేడ్) లేదా 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన, గరిష్ఠంగా 30 ఏళ్ల వయస్సు ఉండి, కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతం లభిస్తుందని తెలిపారు.