అనకాపల్లి గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వరుల ఏకరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శనివారం ఆయన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి, ఎస్. బి డీఎస్పీ జీ. ఆర్. ఆర్. మోహన్ తో కలిసి క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అమ్మవారి రథయాత్ర సాగే పురవీధులను పరిశీలించి, రథం కదిలే సమయంలో జనసందోహాన్ని నియంత్రించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.