
అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌక
భారతదేశానికి చెందిన ఎంవీ గౌతమ్ అనే నౌక అరేబియా సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. మే 3వ తేదీన జనరేటర్ పనిచేయకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నౌక పాకిస్తాన్ సెర్చ్ అండ్ రెస్క్యూ రీజియన్ పరిధిలో ఉన్నప్పుడు, ముంబైలోని ఎంఆర్సీసీ పాకిస్తాన్ నేవీని సహాయం కోరింది. పాకిస్తాన్ నేవీ 'పీఎంఎస్ఎస్ కాశ్మీర్' నౌకను పంపి, ఏడుగురు సిబ్బందికి ఆహారం, వైద్య సహాయం, సాంకేతిక సహాయం అందించింది.




