
సన్రైజర్స్కు చుక్కలు చూపించిన జాకబ్ డఫీ ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2026 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్తో ప్రారంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ తరపున ఆడుతున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ, తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే సన్రైజర్స్కు షాక్ ఇచ్చాడు. పవర్ప్లేలో అభిషేక్ శర్మను అవుట్ చేసి, ట్రావిస్ హెడ్ను కూడా పెవిలియన్కు పంపి, సన్రైజర్స్ను కష్టాల్లోకి నెట్టాడు. 2 కోట్ల బేస్ ప్రైస్కు ఆర్సీబీ కొనుగోలు చేసిన డఫీ, 2026 టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ రన్నరప్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.




