రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం నర్సీపట్నంలో విమర్శించారు.
టీడీపీ 24 నెలల పాలనలో వైసీపీకి చెందిన 21 మందిని హత్య చేశారని, సుమారు 4000 అక్రమ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించేందుకే మాజీ ఎమ్మెల్యే గణేశ్ పై దాడి చేశారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.