జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద డుంబ్రిగూడ మండలంలోని కిల్లోగూడ గ్రామంలో గిరిజన రైతులకు వేరుశెనగ సాగుపై శిక్షణా కార్యక్రమం జరిగింది. అరకు సబ్డివిజనల్ సహాయ సంచాలకులు మోహన్, పాడేరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ప్రదీప్, మెరుగైన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.