డుంబ్రిగుడ పీహెచ్సీలో పోషణ పక్వవాడ కార్యక్రమం ఈ నెల 8 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ ఎస్తేరు రాణి తెలిపారు. గర్భిణీలు పోషకాహారం, చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు తీసుకోవాలని సూచించారు. కనీసం నాలుగు సార్లు వైద్య
పరీక్షలు చేయించుకోవాలని, 180 ఐఎఫ్ఏ, 180 కాల్షియం మాత్రలు తప్పనిసరిగా వాడాలని తెలిపారు.