అనంతగిరిలో త్వరలో ప్రజా మరుగుదొడ్లు ప్రారంభం

1చూసినవారు
అనంతగిరిలో త్వరలో ప్రజా మరుగుదొడ్లు ప్రారంభం
అనంతగిరి మండల కేంద్రంలో పర్యాటకులు, స్థానికుల సౌకర్యార్థం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. అరకు–విశాఖ ప్రధాన రహదారిపై ఉండటంతో ఇక్కడ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండగా, మరుగుదొడ్ల లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 3 లక్షలు, పంచాయతీ నిధుల నుంచి రూ. 50 వేలతో వీటిని నిర్మించినట్లు పంచాయతీ కార్యదర్శి దేవా తెలిపారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్