డుంబ్రిగూడ మండలం కించుమండ, శివనగరం గ్రామాల్లో తహసీల్దార్ శంకరరావు ఓటరు నమోదు ధ్రువపత్రాలను పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని గిరిజనులకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.