అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో, స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని విశాఖలోని కొమ్మాది వైఎస్సార్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గాయత్రి మెడికల్ కాలేజ్ సహకారంతో డా. రవికిషోర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 150 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు అందించింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.