విశాఖ ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర బుధవారం తెలిపారు. 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.